Site icon Sanchika

దుఃఖమే ఏకాంతం!

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘దుఃఖమే ఏకాంతం!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

ఒంటరితనం కోరుకుంటాం..
మనది తన్హాయి దిల్ అనుకుంటాం.
ఎవరూ అక్కర్లేదు అనుకుంటాం.
కానీ మనకి మనుషులే కావాలి
మనల్ని గాయపరిచే మనుషులు కావాలి
ఆ గాయాల్ని దోసిట పట్టి
పొగిలి పొగిలి ఏడవడమే కావాలి
ఒంటరితనం అనుకుంటాం కానీ..
ఎక్కడ ఒంటరిగా ఉంటాం చెప్పండి..
ఒంటరితనంలో..
మనల్ని మనం
వెయ్యి ముక్కలుగా విరగ్గొట్టుకుంటాం..
వెయ్యి మనుషులం గా మారిపోతాం..
మనతో మనమే మాట్లాడుకుంటాం..
ద్వేషిస్తాం.. స్వంత గాయాలు చేసుకుంటూ.. రోదిస్తాం..
అందుకే దగ్గరికి రానిధ్ధాం.. మనుషుల్ని..
రంగు రంగుల మనుషుల్ని..
ముళ్లున్న మనుషుల్ని.
రంగులు మార్చే..
ముళ్ళతో గుచ్చే మనుషుల్ని..
వాళ్ళ గాయాల్ని ఏకాంతంలో
తలుచుకుంటూ దుఃఖించడానికి.
అవును.. దుఃఖమే ఏకాంతం!

Exit mobile version